కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వైరస్ సోకిన వారినే కాదు, సోకని వారినీ ఆందోళనకు గురి చేస్తున్నది. తెలిసిన వారికి కొవిడ్ వచ్చినా కూడా కొందరు బెంబేలెత్తిపోతున్నారు. ‘తమకు వైరస్ వస్తే ఎలా?’ అని తీవ్రంగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకుంటూనే, ఒత్తిడిని జయించే డైట్ ఫాలో కావాలని సూచిస్తున్నారు నిపుణులు.
రెగ్యులర్ డైట్లో పిడికెడు గుమ్మడి పలుకులు ఉండేలా చూసుకోవాలి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడికి గురిచేసే ఎలక్ట్రోలైట్లను నియంత్రిస్తుంది. అలాగే రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది. అరటిపండు తినడం వల్ల కూడా ఇలాంటి ప్రయోజనం పొందవచ్చు.
సమతుల ఆహారం తీసుకున్నప్పుడు జీవక్రియలు సజావుగా సాగుతాయి. మైండ్సెట్ పాజిటివ్గా ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల మెగ్నీషియం లభిస్తుంది. ఇది యాైంగ్జెటీకి విరుగుడుగా పనిచేస్తుంది.
ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్, విటమిన్లు ఆహారంలో ఉండేలా చూసుకుంటే.. మెటబాలిజం సజావుగా ఉంటుంది. హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా సాగేందుకు ఇది దోహదం చేస్తుంది. ఫలితంగా ఒత్తిడి కలగకుండా ఉంటుంది.
డార్క్ చాక్లెట్ కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. నారింజ పండ్లు సైతం ఇమ్యూన్ సిస్టమ్ను ప్రేరేపించడంతోపాటు మానసిక ఆందోళనను దూరం చేస్తాయి.