పరిగి, ఏప్రిల్ 5 : దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్రామ్ ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా పరిగిలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్రామ్ అని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కె.అరవిందరావు, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఎ.సురేందర్కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, కౌన్సిలర్లు వేముల కిరణ్, రవీంద్ర, కృష్ణ, నాగేశ్వర్రావు, బద్రుద్దీన్, వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు బి.రవికుమార్, మొగులయ్య ఉన్నారు.
తాండూరులో..
తాండూరు, ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని సోమవారం తాండూరు నియోజకవర్గంలో నేతలు, అధికారులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తాండూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రభాకర్గౌడ్, రజక సంఘం జిల్లా నాయకుడు కృష్ణ పాల్గొని మాట్లాడారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. జగ్జీవన్రామ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని చెప్పారు.
పెద్దేముల్ మండల కేంద్రంలో..
పెద్దేముల్, ఏప్రిల్ 5 : మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకులు, స్థానిక నేతలతో కలిసి జడ్పీటీసీ ధారాసింగ్, ఎంపీటీసీ పడగాళ్ల అంబరయ్య బాబు జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లారెడ్డి, రియాజ్, రవీందర్, ఎం.వెంకటయ్య, రాము నాయక్, డీవై నర్సింహులు, మండల కోఆప్షన్ సభ్యులు నసీరుద్దీన్, దర్మీది వెంకటయ్య, రాజారత్నం, పెంటప్ప, సామ్యూల్, లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ జిల్లా బాధ్యులు స్వామిదాస్, మల్లికార్జున్, సి.రాములు, డీవై అరవింద్, మల్లేశం, దళిత సంఘాల నాయకులు, యువకులు పాల్గొన్నారు.
కులకచర్ల, చౌడాపూర్ గ్రామాల్లో..
కులకచర్ల, ఏప్రిల్ 5 : కులకచర్ల మండల పరిధిలోని కులకచర్ల, చౌడాపూర్ గ్రామాల్లో బాబు జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాల వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. చౌడాపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్నాయక్, సర్పంచ్ కొత్త రంగారెడ్డి, ఎంపీటీసీ శంకర్, ఉపసర్పంచ్ శివకుమార్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గంగపురి రాములు, ఉపాధ్యక్షులు నర్సింహులు, రాజునాయక్, వార్డు సభ్యులు అశోక్, కృష్ణయ్య, శ్రీను, చెన్నయ్య, యువజన సంఘాల నాయకులు వెంకటేశ్, యాదయ్య, బందయ్య, శ్రీను, విజయ్కుమార్, సి.యాదయ్య, చెన్నయ్య, శ్రీకాంత్, ప్రభాకర్, శేఖర్ పాల్గొనగా, చిన్నగేటు చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతిలో బీజేపీ రాష్ట్రనాయకుడు కరణం ప్రహ్లాద్రావు, గ్రామ పెద్దలు కర్రె రాములు, రాంచందర్, వెంకట్, అంజిలయ్య, వెంకట్రాములు, జాన, వెంకట్, శ్రీనివాస్, నరేశ్, రాజు పాల్గొన్నారు.
పూడూరు : మండలం కేంద్రంలోని పూడూరు గ్రామ పంచాయతీ వద్ద జగ్జీవన్రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ నవ్యారెడ్డి, ఉప సర్పంచ్ రాజేందర్, ఎ.వెంకటయ్య, జంగయ్య, అనంతరాములు, సుదర్శన్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…