దుగ్గొండి, ఆగస్టు 16: పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం సత్ఫలితాలనిస్తున్నది. హరితహారంలో భాగం గా నాటిన మామిడి మొక్క ఏడాదికే కాయలు కాయడం అందరిని ఆశ్చర్యం కల్గించింది. హరితహారంలో భాగంగా వరంగల్ జిల్లా దుగ్గొండి పోలీసులు గతేడాది మామిడి మొక్కలు పంపిణీ చేశారు. మండలంలోని రేఖంపల్లికి చెందిన రైతు వంగాల మోహన్రెడ్డి తన ఇంటి ఆవరణలో ఆ మొక్కను నాటారు. ఏడాదికే కాయలు కాశాయి. ఈ సందర్భంగా మోహన్రెడ్డి మాట్లాడుతూ.. నాటిన పదో నెలకే మొక్క పూతపూసి, పిందెలు వేసిందన్నారు. క్రమంగా కాయలు కాసి పెద్దగా తయారయ్యాయంటూ ఆనందం వ్యక్తంచేశారు.