హైదరాబాద్ : ఊపిరితిత్తులను క్రియాశీలం చేస్తూ మన ఊపిరికి ఆయుష్షును పోద్దామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మంత్రి హరీశ్ చేసిన ఊపిరితిత్తుల వ్యాయామం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఊపిరితిత్తులకు బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే యోగాసనాలు చేద్దామన్నారు. అందరూ రోజు వ్యాయామం చేయాలని వ్యాయామాల్లోనూ యోగా రోగ నిరోధకశక్తిని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తుందన్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఫిట్గా ఉండటంతో పాటు శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయని పేర్కొన్నారు.