ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో మహారాష్ర్ట సర్కార్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. పుణె నగరంలో ఆస్పత్రుల్లో సరిపడ బెడ్లు లేకపోవడంతో ఆస్పత్రి వెలుపలే చికిత్స పొందుతున్నారు.
దీంతో తమ రాష్ర్టానికి పొరుగు రాష్ర్టాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చాలని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్కు మహారాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే విజ్ఞప్తి చేశారు. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వీలైనంత త్వరగా ఆక్సిజన్ సిలిండర్లను పంపాలని కోరారు.
గడిచిన 24 గంటల్లో ముంబైలో 10,030 పాజిటివ్ కేసులు, 31 మరణాలు, పుణెలో 11,040 కేసులు, 34 మరణాలు, నాసిక్లో 4,350 కేసులు, 24 మరణాలు, నాగ్పూర్లో 3,753 కేసులు, 35 మరణాలు సంభవించాయి.
ఇవి కూడా చదవండి..