బీబీపేట్, మార్చి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లెప్రగతితో గ్రామాలు నందనవనాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో దూసుకుపోతున్నది కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామం. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. ప్రతిరోజూ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మొక్కలకు నిత్యం నీరు పడుతున్నారు. దీంతో గ్రామం అంతా సుందరంగా తయారైంది. గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కారం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అధ్వానం..
గతంలో గ్రామ పరిస్థితి అధ్వానంగా ఉండేది. రోడ్ల పరిస్థితి మరీ దారుణం. ప్రస్తుతం ప్రతి వార్డులో సీసీ రోడ్ల పనులు చేపడుతున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.20 లక్షలు, జడ్పీ నిధులు రూ.మూడు లక్షలు, ఎంపీటీసీ నిధులు రూ.ఐదు లక్షలు మంజూరు కావడంతో గ్రామంలోని 10,11,12 వార్డుల్లో సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. దీంతో తమకు రోడ్ల సమస్య తీరనుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పల్లెప్రగతితోనే గ్రామాభివృద్ధి..
పల్లెప్రగతితోనే గ్రామం అభివృద్ధి పథంలో పయణిస్తున్నది. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ట్యాంకర్తో మొక్కలకు నీరు పడుతున్నాం. కంపోస్ట్ షెడ్డులో ఎరువులను తయారు చేస్తున్నాం. ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పనులన్నీ ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
-అల్వాల రేవతి, సర్పంచ్, మాందాపూర్
ఇవీ కూడా చదవండి..
ఐసీఐసీఐ హోమ్లోన్పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
హైదరాబాద్లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!