కొత్తగూడెం క్రైం, జూన్ 26: ఇటీవల మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద (45) కరోనాతో ఈ నెల 24న మృతిచెందినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం శారద మావోయిస్టు పార్టీ చర్ల – శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నది. మహబూబాబాద్ జిల్లా గంగారానికి చెందిన శారద 15 ఏండ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లింది. హరిభూషణ్ మృతిచెందిన మూడు రోజుల్లోనే శారద కరోనా లక్షణాలతో చనిపోయినట్టు ఏజెన్సీలో చర్చ జరుగుతున్నది.