హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సకల జనుల సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజా సంక్షేమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గురువారం బీఆర్కే భవన్లో మంత్రి హరీశ్రావును కలిశారు. బేసిక్-పే అమలుకు సంబంధించిన 104, 105, 106 జీవోల ప్రతులను వారికి మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అందించారు. జేఏసీ నాయకులు సీఎంతోపాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తుంటారని మంత్రి హరీశ్రావు అన్నారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ చైర్మన్ కనక చంద్రం, సిద్దిపేట ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేశ్, మహిళా విభాగం కార్యదర్శి మాలతి, డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు వినోద్కుమార్ పాలిటెక్నిక్ కళాశాలల సంఘం అధ్యక్షుడు ఉమా శంకర్, రాష్ట్ర నాయకులు సదానందం, త్రిభువనేశ్వర్ పాల్గొన్నారు.