హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతమే హనుమంతుని జన్మస్థలమని టీటీడీ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో, అక్కడ శుక్రవారం నుంచి 8వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ పంచాంగంలో నిర్దేశించిన ప్రకారం ఏటా చేసే కార్యక్రమాలు యథాతథంగా ఉంటాయని చెప్పారు. తిరుమలకు వచ్చే యాత్రికులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చన్నారు.