జైపూర్ : మానవత్వం లేని కొందరు ఆందోళనకారులు.. గర్భిణిని తరలిస్తున్న అంబులెన్స్ను అడ్డుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.
నాథావాలా బైపాస్పై భారత్ బంద్లో భాగంగా ఆందోళనకారులు నిరసనకు దిగారు. ఇదే సమయంలో నెలలు నిండిన గర్భిణిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తున్నాయి. అయితే ఆందోళనకారులు మానవత్వం మరిచి.. అంబులెన్స్ను అడ్డుకున్నారు. తమ బిడ్డకు పురిటినొప్పులు అధికమయ్యాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు దారి ఇవ్వండి అంటూ ఆందోళనకారులకు మొర పెట్టుకున్న వారు కనికరించలేదు. ఆలస్యంగా గర్భిణిని ఆస్పత్రికి తరలించడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి