హైదరాబాద్: మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మరణంపట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంకోసం ఎమ్మెస్సార్ కృషి చేశారన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెస్సార్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారికి సద్గతులు కలగాలని ప్రార్థించారు. 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఎమ్మెస్సార్ కీలక పాత్ర పోషించారని, సుదీర్ఘ కాలం ప్రజాసేవలో ఉన్నారని ఆయన సేవలను కొనియాడారు.
అదేవిధంగా మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్ ఎమ్మెస్మార్ మృతిపట్ల సంతాపం తెలిపారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా సేవలో కొనసాగిన ఆయన తెలంగాణ వాదిగా, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారని, ముక్కుసూటి నేతగా తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..