నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలుగు రాష్ర్టాల నదీ జలాల సమస్యకు మధ్యవర్తిత్వం వహిస్తాననడాన్ని స్వాగతిస్తామని, ముందు ఏపీ పునర్విభజన చట్టంప్రకారం రాష్ర్టానికి దక్కాల్సిన వాటిపై కేంద్రా న్ని నిలదీయాలని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి డిమాండ్చేశారు. సోమవారం నల్లగొండలో ఆయన మాట్లాడారు. పునర్విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయని కేంద్ర మంత్రి ని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఏడు మండలాలతోపాటు లోయర్ సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాలో ఏకపక్షంగా కలిపేశారని మండిపడ్డారు. ఇప్పుడు వాటిని తిరిగి తెలంగాణకు తీసుకురాగాలరా.. మీకు ఆ శక్తి ఉందా? అని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. 2010లో యూపీఏ హయాంలో వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్ట రీ మంజూరైందని, దానిని పూర్తిచేస్తామని బీజేపీ నేతలు చెప్పారని గుర్తుచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రం దాని ఊసే ఎత్తట్లే దని ఆగ్రహించారు. 2018లో మహారాష్ట్రలోని లాతూర్కు రైల్వేకోచ్ ఫ్యాక్టరినీ తరలించి, శరవేగంగా పనులు చేస్తున్నది నిజం కాదా అని నిలదీశారు. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీని వరంగల్కు తీసుకొచ్చి కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని సవాల్చేశారు. రాష్ట్రంలో పండే ప్రతి వడ్ల గింజనూ ఎఫ్సీఐతో కొనుగోలు చేయిస్తామని కిషన్రెడ్డి కేంద్రంతో చెప్పించగలరా అని ప్రశ్నించారు. గణేశ్ నిమజ్జనం హుస్సేన్సాగర్లో వద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే.. దానికి వ్యతిరేకంగా తాము అందులోనే చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడ టం సమంజసమేనా అని నిలదీశారు. అధికార దాహంతో మత కల్లోలాలు సృష్టించే లక్ష్యంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న బండి సంజయ్ది నోరా.. మోరీనా..? అని మండిపడ్డారు.