హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనందుకు జస్టిస్ ఎన్వీ రమణకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ నల్గొండ జిల్లాలో పంటలు ఎలా పండుతున్నాయని, వరి పంట పండించడంలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఎలా నిలిచిందని సుఖేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్, ఏఎంఆర్, డిండి ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందించామని గుత్తా తెలిపారు. అలాగే కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎస్సారెస్పీ కాలువ ద్వారా పంటపొలాలు అందించడంతో వరిని రైతులు బాగా పండించారని చీఫ్ జస్టిస్కు వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నల్గొండ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
మోడల్ స్కూళ్లు అధునాతన దేవాలయాలు
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్