హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను దసరా పండుగ తర్వాత తెరుస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియంను ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. విద్యాహక్కు చట్టం పాక్షికంగా అమలవుతున్నదన్నారు. రాష్ట్రంలోనికి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రాకుండా కఠిన చర్యలు తీసుకొంటామన్నారు.