హైదరాబాద్, జూన్7 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేశారు. ఫలితాలను https://mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్లో చూడవచ్చని గురుకులాల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని మంత్రి గంగుల ఈ సందర్భంగా ఆకాంక్షించారు.