హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యంత కఠినమైన జేఈఈ మెయి న్ పరీక్షల్లోనూ తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థల విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబరిచారు. బుధవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ లో 1,173 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇందు లో సాంఘిక సంక్షేమ విద్యాలయాల సంస్థ పరిధిలో 638 మంది, గురుకుల పరిధిలో 500 మంది, మహాత్మాజోతిబాపూలే గురుకుల పరిధిలో 85 మంది జేఈఈ మెయిన్స్ రాస్తే అందులో 45 మంది అత్యుత్తమ పర్సెంటైల్ సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, గంగుల కమలాకర్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్రోస్ అభినందించారు. గిరిజన గురుకుల విద్యాలయసంస్థలో ఏడుగురు విద్యార్థులకు 90కిపైగా ప ర్సెంటేల్, 80 పర్సెంటేల్ కన్నా ఎక్కువ సాధించిన విద్యార్థులు 70 మం ది ఉండటం విశేషం. పూలే గురుకుల నుంచి 85 మంది జేఈఈ రాస్తే అందులో 45 మంది ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధిస్తారని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు.