బడంగ్పేట,మే19: పురాతన కట్టడాలు, ప్రాచీన వారసత్వ సంపదను భావి తరాలకు అందించవలసిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బరుజు దగ్గర చేపడుతున్న సుందరీకరణ పనులను, నూతనంగా ఏర్పాటు చేసిన రాక్ పార్కును మంత్రి బుధవారం పరిశీలించారు. బురుజు చుట్టు ఏర్పాటు చేసిన గ్రీనరీ, అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. దావూద్ఖాన్ గూడలో ఏర్పాటు చేసిన నర్సిరీ, పార్కులో ఏర్పాటు చేసిన వివిధ రకాల మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా విశేష ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలకు పూర్వ వైభవం తేవడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆమె కొనియాడారు. బురుజును సుందరీకరణ చేయడంతో పర్యాటక స్థలంగా మారుతుందన్నారు. ఉదయం, సాయంత్రం సమయాలలో వాకింగ్ చేయడానికి పార్కులు ఎంతో ఉపయోగ పడుతున్నాయని ఆమె అన్నారు. స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరు మొక్కలను నాటవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్రెడ్డి, డీఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, బీమిడి స్వప్న జంగారెడ్డి, పెద్దబావి సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ బడంగ్పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ వంకాయల యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.