మేడ్చల్ మల్కాజిగిరి : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి బాగుందని పాలకవర్గ పనితీరును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. బుధవారం గుండ్లపోచంపల్లికి విచ్చేసిన మంత్రి మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్, ట్యాంకర్ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఒకసారి గుండ్ల పోచంపల్లికి వచ్చానని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అభివృద్ధిలో గణనీయ మార్పు కన్పిస్తుందన్నారు. వెడల్పు రోడ్లు, ఫుట్పాత్లు, హరితహారంలో నాటిన మొక్కలతో కళకళలాడుతుందని ప్రశంసించారు. పాలకవర్గం ఇదే స్ఫూర్తితో ముందుకువెళ్తూ అభివృద్ధిలో వేగాన్ని పెంచారని సూచించారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మున్సిపాలిటీలో అనూహ్యంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలకు నిధులు కొరత లేదన్నారు. మున్సిపాలిటీ చైర్పర్సన్లు, పాలకవర్గ సభ్యులు సమష్టిగా కృషి చేసి, అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు రాగ జ్యోతి, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, బేరి బాలరాజు, వీణాసురేందర్గౌడ్, జైపాల్రెడ్డి, పెంటయ్య, శ్రీనివాస్, హేమంత్రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవగౌడ్, వర్కింగ్ ప్రెసిండెంట్ కందాడి నరేందర్రెడ్డి, నాయకులు మారేపల్లి సుధాకర్, భానుచందర్, గౌస్ఖాన్, ఆదిత్యరాజ్సింగ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
భర్త వద్దంటే పనికి వెళ్లాడని భార్య ఆత్మహత్య
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు