న్యూఢిల్లీ: ఇండియాలో అత్యంత విలాసవంతమైన కార్ల బ్రాండ్గా మెర్సిడెస్ నిలిచింది. తర్వాతీ జాబితాలో బీఎండబ్ల్యూ, జాగ్వార్, లంబోర్ఘినీ బ్రాండ్ కార్లు ఉన్నాయి. అత్యంత లగ్జరీ స్పోర్ట్స్ కార్ల జాబితాలో పొర్చె, ఆస్టోన్ మార్టిన్ ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరూ వాడే చేతి గడియారాల్లో రోలెక్స్ నిలిచింది. ఇక జ్యువెల్లరీ బ్రాండ్లలో టాటా సన్స్ అనుబంధ సంస్థ తనిష్క్.. ఆతిథ్య రంగంలో తాజ్, మారియట్ చోటు దక్కించుకున్నాయి.
మిలియనీర్లంటే అంతా విమాన ప్రయాణాలే చేస్తారు. అందులోనూ మిలియనీర్లలో అత్యధికులు ఎమిరెట్స్ విమాన సర్వీసులకే టాప్ ప్రియారిటీ ఇచ్చారని హరున్ ఇండియా సంస్థ మంగళవారం వెల్లడించింది. తదుపరి సింగపూర్ ఎయిర్లైన్స్, ఎతిహాద్ ఎయిర్లైన్స్ విమానాల్లో ప్రయాణానికే మొగ్గు చూపుతారు.
ఇక మిలియనీర్ల ఆర్థిక లావాదేవీలన్నీ హెచ్డీఎఫ్సీ, ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ల్లోనే సాగుతాయి. ప్రస్తుతం అంతా ప్రైవేట్ సంస్థలపైనే మోజు పెంచుకున్నా.. బీమా సేవల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వైపే మొగ్గుతున్నారు. ఇంపోర్టెడ్ మద్యం జాబితాలో జానీ వాకర్ బ్లూ, అంతా ఇష్టపడే షాంపైన్లో డామ్ పెరిగ్నోన్ నిలిచింది.