మెదక్ : మహిళలందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక స్వాలంభన జరుగుతుందని, మహిళా సాధికారత సాధ్యమవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం నాబార్డు నిధులు రూ. 5 లక్షల ఖర్చుతో మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన మంజీరా రూరల్ మార్ట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడ పిల్లలను చదివించాలని సూచించారు. వారు చదువుకోవడం వల్ల సమాజంలో ఆర్థికంగా ఎదగడంతో పాటు ధైర్యంగా బతకగలుగుతారని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని, వారికి ప్రభుత్వం తరపున నా తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
నాబార్డు సహాయంతో ఏర్పాటు చేసిన దుకాణంలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయన్నారు. అనంతరం మంజీర రూరల్ మార్టులో విస్తరాకులతోపాటు ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్, అడిషనల్ డీఆర్డీవో భీమయ్య, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు
జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోతారు