హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,801 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 7,430 మంది కోలుకున్నారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,06,988కి పెరిగాయి.
వీరిలో 4,44,049 మంది కోలుకున్నారు. ఇవాళ్టి వరకు 2,803 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 75,289 శాంపిళ్లను పరీక్షించారు. తెలంగాణలో కొవిడ్ మరణాలు రేటు 0.55 శాతంగా ఉంది. రికవరీ శాతం 87.58గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.