Group-4 Results | హైదరాబాద్ : గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. మెరిట్ జాబితా విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-4 కింద 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 7,26,837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొన్నారు. ధ్రువపత్రాల వెరిఫికేషన్కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. గతేడాది జులైలో గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు వెబ్సైట్లో ర్యాంకులు చూసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. అభ్యర్థులు మెరిట్ లిస్ట్ కోసం ఈ లింక్ను క్లిక్ చేయండి.