నాగర్ కర్నూల్ : ప్రేమ పెండ్లి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలంలోని వెన్నచర్ల గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఓ ప్రేమజంట ఆదివారం ఊరు నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య విద్వేషాలు రగిలాయి. అమ్మాయి కోసం వెతికిన కుటుంబ సభ్యులు.. ఆదివారం అబ్బాయి అన్న చెన్నయ్య, వదిన ఉషపై గొడ్డలి, రోకలిబండతో దాడులు చేశారు.
ఈ ఘటనలో ఉష తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఇన్ చార్జి డీఎస్పీ గిరిప్రసాద్ , సీఐ గాంధీనాయక్ , ఎస్సై నాగన్న చేరుకొని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన లింగస్వామి, లక్ష్మయ్య, శాంతమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులను మంగళవారం జైలుకు పంపినట్లు ఎస్సై తెలిపారు.
కాగా, చికిత్స పొందుతున్న ఉష (32) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు. పరిస్థితులు చేజారకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
దేశానికే ఆదర్శం ఇంటింటికి జ్వర సర్వే : ఎమ్మెల్సీ కవిత
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం