రాజాపేట, జూలై12: పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధిస్తుంది. పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని బూర్గుపల్లి గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పల్లె ప్రగతిలో మంజూరైన నిధులను పాలకులు సక్రమంగా గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నారు. దీంతో గ్రామంలో రోడ్లు, వైకుంఠధామం, డంపింగ్యార్డు , పల్లెప్రకృతి వనంతోపాటు అంతర్గత మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తయి ప్రగతి వైపు దూసుకుపోతున్నది.
ప్రగతి వైపు అడుగులు
గ్రామ అభివృద్ధి కోసం పల్లె ప్రగతిలో మంజూరైన నిధులను సర్పంచ్ చింతల పరిమళాసంపత్ సక్రమంగా వినియోగించుకోవడంతో అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. గ్రామంలో సుమారు రూ. 6 లక్షలతో అంతర్గ త మురికి కాలువ నిర్మాణం, రూ.7.50 లక్షలతో కమ్యూనిటీహాల్, రూ.7 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, రూ 2.50 లక్షలతో డంపింగ్యార్డు, రూ.50 వేలతో వాటర్ ఫిల్టర్తోపాటు పంచాయతీ నిధులతో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇంటింటికీ చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తూ గ్రామ స్వచ్ఛతకు పాటుపడుతున్నారు. గ్రామ శివారులో పల్లెప్రకృతి వనంలో తీరొక్క మొక్కలు నాటి సంరక్షిస్తుడటంతో ఆహ్లాదకరంగా తలపిస్తున్నది. గ్రామానికి వచ్చే రోడ్లకు ఇరువైపులా 2050 మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగి అందాన్నిస్తున్నాయి.
తీరిన చితి కష్టాలు
మండలంలోని బూర్గుపల్లిలో 610 మం ది జనాభా ఉండగా, 452 మంది ఓటర్లు ఉన్నారు. పల్లె శివారులోని ప్రభుత్వ భూమి లో ఉపాధిహామీ పథకంలో రూ.12.50 లక్ష ల నిధులు కేటాయించగా వైకుంఠధామం పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అట్ట్టహాసంగా ప్రారంభించా రు. సర్పంచ్ చింతల పరిమళాసంపత్ ఆధ్వర్యంలో ఆ పనులు శరవేగంగా పూర్తి కావడంతో గ్రామస్తులకు చితి కష్టాలు తీరాయి.
గ్రామస్తుల భాగస్యామ్యంతోనే అభివృద్ధి
పల్లెప్రగతిలో భాగం గా మంజూరైన నిధుల ను గ్రామాభివృద్ధికి సక్రమంగా వినియోగించుకున్నాం. ప్రజల పూర్తి భాగస్వామంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తు న్నా. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
-చింతల పరిమళాసంపత్, సర్పంచ్
జోరుగా పల్లె ప్రగతి పనులు
గ్రామంలో పల్లె ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ప్రతి రోజూ పారిశుధ్య పనులు చేపడుతున్నారు.గ్రామ శివారులో వైకుంఠధామం, డం పింగ్యార్డు పనులు పూర్తయ్యాయి. పల్లె ప్రకృతి వనం లో, రోడ్లపై పూలను నాటి సంరక్షిస్తున్నారు.