హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో 18,449 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన అధికారపార్టీ అభ్యర్థి నోముల భగత్కు సర్వత్రా శుభాకాంక్షలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ విజయాన్ని తెలంగాణ భవన్లో స్వీట్లు పంచుకోవడం, పటాకులు కాల్చడం ద్వారా నాయకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, తలసాని సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నోముల భగత్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో యువ నేత నోముల భగత్ సారధ్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కాంక్షించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టిన ఓటరు మహాశయులందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన టీఆర్ఎస్ సైనికులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.