హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ముస్లిం సోదరులకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, అమితమైన భక్తికి బక్రీద్ పండుగ ప్రతీకని పేర్కొన్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం, భక్తిభావంతో అన్నీ పంచుకోవడం వంటి ఎన్నో గొప్ప లక్షణాలను బక్రీద్ సూచిస్తుందని తమిళిసై చెప్పారు. పండుగ సోదరభావాన్ని మరింత పెంపొందించాలని, శాంతిని సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులు.. ప్రవక్త శాంతిబోధనలను అనుసరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. తోటివారిపట్ల త్యాగం, కరుణ, సహనం ప్రదర్శించాలనే సందేశాన్ని బక్రీద్ నుంచి నేర్చుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు, మంత్రులు కేటీఆర్, మహమూద్అలీ, హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, వీ శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలను నింపే పలు పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగని పేర్కొన్నారు. ఏకాదశి పండుగ శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని భగవంతుడిని ప్రార్థించారు.