జనగామ : పల్లె ప్రగతిలో భాగంగా పచ్చదనం పెంపులో ఉపాధి కూలీలు కృషి చేయాలని పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం కొడకండ్ల మండలంలో మంత్రి పర్యటించారు. రహదారుల వెంట మొక్కలు నాటి వాటికి రక్షణగా గార్డులను ఏర్పాటు చేయక పోవడంతో దెబ్బతింటున్నాయి. వాటికి ముళ్ల కంచెతో రక్షణకు చర్యలు తీసుకోవాలని కూలీలకు మంత్రి సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో పచ్చదనం పెంపునకు విరివిగా మొక్కలు నాటాలని ఆదేశించారు.
గ్రామ ప్రవేశం నుంచి రహదారికి ఇరువైపులా పచ్చదనంతో గ్రామాలకు కొత్త శోభ తేవాలన్నారు. పల్లె ప్రగతిలో నాటిన మొక్కల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వన సేవకులకు చెల్లింపులు ఎప్పటికప్పుడు చేయాలన్నారు. నాటిన మొక్కలు వంద శాతం మనుగడ పొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. మొక్కలకు షెడ్యూల్ ప్రకారం వాటరింగ్ కచ్చితంగా చేపట్టాలన్నారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి