సూర్యాపేట : ఎటువంటి అలజడులకు, అరాచకాలకు తావు లేకుండా గాంధీ చూపిన మార్గానికే వన్నె తెచ్చిన యోధుడు సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శాంతియుత స్వభావానికి గాంధీజీ మారుపేరు అయితే.. అదే శాంతి స్వభావానికి మరింత పదును పెట్టి గమ్యాన్ని చేరుకున్న కేసీఆర్ అని ఆయన కొనియాడారు.
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోనీ తన నివాస గృహంలో పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. కొవిడ్ నిబంధనలు పురస్కరించుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సాదా సీదాగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందు పరచిన అంశాన్ని అవకాశంగా వినియోగించుకుని తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ఘనమైన చరిత్ర సీఎం కేసీఆర్ది అని తెలిపారు.
రాజకీయ పార్టీతో ఉద్యమాన్ని సాధించి లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా వచ్చిన తెలంగాణా రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించి భారత దేశంలో నే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు గడించారన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా