విజయనగరం: ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతున్నది. రోజురోజుకూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతున్నది. ఏపీ పోలీస్ శాఖలోనూ ఇప్పటికే కరోనా బారినపడి పలువురు పోలీసులు మృతిచెందారు. ఇవాళ మరో పోలీస్ అధికారిని కరోనా మహమ్మారి బలితీసుకున్నది.
విజయనగరం సీసీఎస్ డీఎస్పీగా పనిచేసే జుత్తు పాపారావుకు ఇటీవల కరోనా సోకింది. దాంతో ఆయన విశాఖపట్నంలోని శ్రద్ధ ఆస్పత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. ఆయన భార్య పిల్లలకు కూడా కరోనా సోకింది. భార్య ఆయనతోపాటే శ్రద్ధ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారి ఇద్దరు పిల్లలు కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
పాపారావు 1991లో ఎస్సైగా ఎన్నికయ్యారు. ముందుగా విశాఖపట్నంలో ఎస్సైగా పనిచేశారు. ఆయన వివిధ స్టేషన్లలో విధులు నిర్వహించారు. అనంతరం సీఐగా పదోన్నతి పొందిన తర్వాత కూడా వివిధ స్టేషన్లలో పనిచేశారు. విశాకపట్నంలో మహిళా పోలీస్స్టేషన్ ఏసీపీగానూ విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయనగరం సీసీఎస్ డీఎస్పీగా పనిచేస్తూ కరోనా కాటుకు బలయ్యారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో