ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ వెంకటేశ్వర్లు
గండీడ్, జూన్ 13 : మండలంలోని జంగంరెడ్డిపల్లిలో చిన్ననర్సయ్య హత్యను మర్చిపోకముందే మరో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఎస్సై రాముడు క థనం మేరకు.. మండలంలోని లింగాయపల్లి గ్రామానికి చెందిన ఏదుల మల్లయ్య (35) కూలీపని చేసుకొ ని జీవనం కొనసాగించేవాడు. కూలీ పనుల నిమిత్తం ప్రతిరోజూ కోస్గికి నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాడు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బ యటికి వెళ్లిన అతడు.. వెన్నాచేడ్ నుంచి బైస్పల్లికి వెళ్లే మార్గంలో దారుణహత్యకు గురయ్యాడు. ఆదివారం మల్లయ్య మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెన్నాచేడ్ సర్పంచ్ పుల్లారెడ్డికి తెలియజేయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహ్మదాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డాగ్స్కాడ్, క్లూస్టీంలతో విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. హత్యకేసును ఛేదించేందుకు జిల్లా అధికారుల ఆదేశం మేరకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే నేరస్తులను పట్టుకుంటామన్నా రు. డీఎస్పీ శ్రీధర్, సీఐ మహేశ్వర్రావు ఉన్నారు.