గంగాధర, ఏప్రిల్ 9: గ్రామాల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని డీఎల్పీవో హరికిషన్ ఆదేశించారు. మండలంలోని కాచిరెడ్డిపల్లి గ్రామాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్మించిన ఆధునిక వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు. పల్లె ప్రకృతివనం, బ్లాక్ ప్లాంటేషన్, నర్సరీని పరిశీలించి మొక్కలకు నీళ్లు పట్టారు. మొక్కలు ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించి, పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో జనార్ధన్రెడ్డి, సర్పంచ్ జోగు లక్ష్మిరాజం, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చెలరేగిన డివిలియర్స్.. ముంబైపై ఆర్సీబీ విజయం
మినీ లాక్డౌన్లతో మైక్రోఫైనాన్స్ సంస్థలు కుదేలే!