మెహిదీపట్నం, జూలై 20: అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం కేసీఆర్ చేతల ముఖ్యమంత్రి అని నిరూపిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు అన్నారు. దళితబంధుపై హర్షం వ్యక్తంచేస్తూ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్, డివిజన్ అధ్యక్షుడు హైమద్అలీ ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లి రెడ్హిల్స్ డివిజన్ వీర్నగర్లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దళితబంధు పథకంతో ఎంతో మేలు జరుగుతుందని ప్రభాకర్రావు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు జకీఉల్లాఖాన్, అభిషేక్, నాయకులు సంజయ్, నరేందర్, ప్రదీప్ అగర్వాల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.