హైదరాబాద్, ఆగస్టు 9: హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా గత త్రైమాసికానికిగాను రూ.128 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. అంతిక్రతం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.120 కోట్లతో పోలిస్తే ఆరు శాతం అధికమైనట్లు పేర్కొంది. కంపెనీ ఆదాయం రూ.850 కోట్ల నుంచి 20 శాతం అధికమై రూ.1,020 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. 62 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఒక్కో షేరుకు రూ.400 చొప్పున ఇందుకోసం రూ.250 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్ తెలిపారు.