స్టేషన్ఘన్పూర్, మే 16: ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా సోకగా.. 90 ఏళ్ల తాత, 6 నెలల వయసున్న బాబు కరోనా ను జయించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడం పీహెచ్సీ పరిధిలోని కోమటిగూడెంకు చెందిన గొట్టం యాదగిరి(90) మనుమరాలు అనూష మొదటి కాన్పు కోసం రాగా బాబు జన్మించాడు. ఈలోగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఆమె ఇక్కడే ఉండిపోయింది. ఈక్రమంలో ఏప్రిల్ 26న యాదగిరి, అనూష, ఆమె బాబు(6 నెలలు)తోపాటు ఇంట్లో మరో ముగ్గురికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. కుటుంబసభ్యులు అందరూ వైద్యుల సూచనలు పాటించి కరోనాను జయించారు.