జయశంకర్ భూపాలపల్లి : ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రైతులకు సూచించారు. గణపురం మండలం, చెల్పూర్ గ్రామంలోని పేఏసీఎస్ సొసైటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా వైరస్ సోకి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల