హైదరాబాద్ : గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ప్రగతిభవన్లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోయిన సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఆ కేంద్రాలన్నింటి ద్వారా ధాన్యం సేకరణ జరపాలని సీఎం పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు.
మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుదని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంకవర్గీస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గురుకులాల ప్రారంభం స్టే ఎత్తివేయాలి.. హైకోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి
Crime news |సిమెంట్ లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
ఒప్పో రెనో 7 ఫీచర్లు లీక్..ధర ఎంతంటే..!