లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను చంపేస్తామని అజ్ణాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. యోగికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలిఉన్నాయని ఆ వ్యక్తి హెచ్చరించాడు. యూపీ పోలీసులకు సంబంధించి వాట్సాప్ ఎమర్జెన్సీ డయల్ నెంబర్ 112 కు ఈ హెచ్చరికలు వచ్చాయని పోలీసులు తెలిపారు.
సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేసి ఈ నెంబర్ ను ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక నిఘా టీంను పోలీసులు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 29 సాయంత్రం బెదిరింపు కాల్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. యోగి ఆదిత్యానాథ్ కు గతంలోనూ పలుమార్లు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.