జయశంకర్ భూపాలపల్లి, మే11(నమస్తేతెలంగాణ) : లాక్డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. 10 రోజుల పాటు నిబంధనలకు లోబడి భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా కట్టడి కోసం ముఖ్యంగా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద, జిల్లా కేంద్రం, రేగొండ మండలంలోని జిల్లా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపులు ఉంటాయని, ఆసమయంలో విధిగా కొవిడ్ రూల్స్ను పాటిస్తూ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.