హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/ ఉప్పల్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఓటింగ్కు పట్టభద్రుల నుంచి భారీ స్పందన వచ్చిందని, గతంకంటే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. ఓటింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులు ఎక్కువగా ఉం డటం సవాల్గా మారినప్పటికీ ఎలాంటి సమస్య లేకుండా పోలింగ్ పూర్తిచేసినట్టు వివరించారు. పోలింగ్ నిర్వహణలో కష్టపడి పనిచేసిన ఎన్నికల సిబ్బంది, పోలీసులను అభినందించారు. పోలింగ్పై ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల తర్వాత కూడా ఓటర్లు క్యూలో ఉన్నారని, వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. అంతకుముం దు వరంగల్, హైదరాబాద్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈనెల 17న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని శశాంక్ గోయల్ తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియం, నల్లగొండలోని మార్కెట్ గిడ్డంగిలో కౌంటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. బ్యాలెట్ బాక్సులకు పటిష్ట భద్రత కల్పించామన్నారు.