దేవాదాయశాఖ వినూత్న ప్రచారం
ఆలయ భూముల వద్ద యమ ధర్మరాజు ఫొటోలతో కూడిన బోర్డుల ఏర్పాటు
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ‘దేవుని భూమిని ఆక్రమించిన.. పాపము మూట కట్టుకుందురు’ అంటూ దేవాదాయశాఖ వినూత్న ప్రచారానికి తెరలేపింది. దేవుడి భూములు ఆక్రమిస్తే పాపమని పేర్కొంటూ యమధర్మరాజు ఫొటోతో కూడిన బోర్డులను ఆలయ భూముల వద్ద ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రంలో సుమారు 20 వేల ఎకరాల పైచిలుకు దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. వీటిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. దేవాదాయ రికార్డుల ప్రకారం అవి దేవాదాయ భూములని స్పష్టమవుతున్నా ఆక్రమణదారులు వాటికోసం కోర్టుల్లో పోరాడుతున్నారు. ఈ ఆక్రమణల పర్వం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ వినూత్న ప్రచారానికి తెరతీసింది.