ముంబై, మార్చి 17: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా నాలుగో రోజూ నష్టాలు తప్పలేదు. వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయం తీసుకోవడానికి ముందు మదుపరులు అప్రమత్తత పాటించారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా సూచీల పతనాన్ని శాసించాయి. దీంతో సెన్సెక్స్ 50 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. 562.34 పాయింట్లు (1.12%) నష్టపోయి 49,801.62కి జారుకున్నది. అలాగే నిఫ్టీ 189.15 పాయింట్లు తగ్గి 14,721.30 వద్ద ముగిసింది. ఫలితంగా గత నాలుగు రోజుల్లో మదుపరులు రూ.5.55 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.5,55,400.52 కోట్లు తగ్గి రూ.2,03,71,252.94 కోట్లకు పడిపోయింది.