హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్సింగ్ బుధవారం ఏసీబీ డైరెక్టర్ జనరల్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. ఏసీబీతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా సైతం గోవింద్సింగ్ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. మొత్తంగా ఆయన మూడు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.