ముంబై : దేశంలోనే కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మహారాష్ర్ట ప్రథమ స్థానంలో నిలిచిన విషయం విదితమే. ఆ రాష్ర్ట రాజధాని ముంబైలోనూ అదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే 5 వారాల తర్వాత ముంబైలో అత్యల్పంగా కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం 2,624 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 78 మంది మరణించారు. ఈ ఏడాది మార్చి 17వ తేదీన 2,377 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి ముంబైలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,58,621కి చేరింది. మరణాల సంఖ్య 13,372. నిన్న ఒక్కరోజే మహారాష్ర్ట వ్యాప్తంగా 48,621 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ర్టలో రికవరీ రేటు 84.7 శాతంగా ఉంది.