హైదరాబాద్ : రేపు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశంలోని వైద్యులందరికీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిపై వైద్యులు నిబద్ధత, ధైర్యంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. వైద్యుల సేవలకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఇదే సరైన సందర్భమని గవర్నర్ అన్నారు. మన ప్రాణాలను కాపాడే.. వైద్యులను మనం రక్షించుకోవాలని సూచించారు. కరోనాపై ఎనలేని పోరాటం చేస్తున్న వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.