హైదరాబాద్ : గ్రామీణాభివృద్ధి శాఖలో సహకార శాఖ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సహకార శాఖ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కోరారు. మంత్రిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంగళవారం ఆ సంఘం ప్రతినిధులు, రాష్ట్ర సహకార శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసిషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి భీం రాజు, ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, ఈగ వెంకటేశ్వర్లు, గంథం శ్రీనివాసరావు, నాగేశ్వర్రావు కలిశారు. పీఆర్సీ ఇచ్చినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో సహకార శాఖ నుంచి పలువురు అధికారులు వివిధ హోదాల్లో గ్రామీణాభివృద్ధి శాఖలో తమ సేవలందించారని, ప్రస్తుతం సైతం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
మంత్రి ఎర్రబెల్లిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్ఎస్ఎస్) నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. వరుసగా మూడోసారి ఈ కార్యవర్గం ఎంపికవడంపై సంఘం సభ్యులను అభినందించారు. మంత్రిని కలిసిన వారిలో వెన్నంపల్లి జగన్మోహన్రావు శర్మ ఆధ్వర్యంలో గౌరవ సలహాదారు బీ హన్మంతచారి, కార్యదర్శి నాగేశ్వర సిద్ధాంతి, మహిళా విభాగం అధ్యక్షురాలు దేవులపల్లి వాణి, రీజనల్ కార్యదర్శి వక్కలంక శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తులసి శ్రీనివాస్, కార్యదర్శి మునిపల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తేరాల వాణి ఉన్నారు.