హైదరాబాద్ : ఫ్లోరోసిస్ బాధితురాలు సువర్ణకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై శనివారం మోటరైజ్డ్ ట్రై సైకిల్ను వితరణగా అందజేశారు. సువర్ణ నల్లగొండ జిల్లా వాసి. ఆమె పరిస్థితిని ఓ ఎన్ఆర్ఐ ట్విట్టర్ ద్వారా గవర్నర్కు విన్నవించాడు. ఎన్ఆర్ఐ వినతికి స్పందించి గవర్నర్ సువర్ణను రాజ్భవన్కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాను వేసిన గవర్నర్ ఫోటో పెయింటింగ్ను తమిళిసైకి సువర్ణ అందజేసింది. చేయి సహకరించకపోయినా తన చిత్రాన్ని అద్భుతంగా వేసిన సువర్ణను గవర్నర్ ప్రసంశించారు. సువర్ణ కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ భోజనం చేశారు. ఆమె చదువుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ట్రై సైకిల్ను స్సాన్సర్ చేసిన రవి హేలియోస్కు చెందిన డాక్టర్ విజయ్ భాస్కర్ గౌడ్ను గవర్నర్ ప్రశంసించారు.