హైదరాబాద్ : బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు సంబంధించిన తొమ్మిది గ్రంథాలను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. పీవీ మార్గ్లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కే కేశవరావు, పీవీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ తొమ్మిదిలో పీవీ రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం.