ఆవిష్కరించిన చెన్నై కెప్టెన్ ధోనీ
చెన్నై: భారత సా యుధ దళాల సేవల ను స్మరించుకునేలా రూపొందించిన నూతన జెర్సీతో ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది. ఈ కొత్త జెర్సీని జట్టు కెప్టెన్ మహేం ద్ర సింగ్ ధోనీ బుధవారం ఆవిష్కరించాడు. ఆర్మీని గుర్తు చేసేలా ఈ జెర్సీ భుజాలపై బంగారు రంగు బోర్డర్తో కామొఫ్లేజ్ (ఆర్మీ యూనిఫాం ఉండే రంగు) ఉంది. టెరిటోరియల్ ఆర్మీలో ధోనీకి లెఫ్టినెంట్ కర్నల్ హోదా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ప్యారాచుట్ రెజిమెంట్లోనూ మహీ శిక్షణ పొందాడు.