హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): 18 ఏండ్లు పైబడినవారందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్ హర్షం వ్యక్తంచేశారు. దేశ వాక్సినేషన్ చరిత్రలో కొవిడ్ మహమ్మారిపై పోరులో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రజలందరికీ రాబోయే కొద్ది నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీలో, పంపిణీలో భారత్ ముందంజలో ఉన్నదని పేర్కొన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల కుటుంబాలకు నవంబర్ వరకు ఉచిత రేషన్ అందించాలనేది గొప్ప నిర్ణయమని చెప్పారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్న ఆమె సోమవారం రాజ్భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడి అధికారులతో వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పుదుచ్చేరిలో 100% వ్యాక్సినేషన్ జరగాలని ఆదేశించారు.