సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల ఐదు రోజుల్లో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం, మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.6, కనిష్ఠం 26.6 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 47 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. 31న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని, రాష్ట్రంలో వాతావరణం కొంత చల్లబడే అవకాశాలున్నాయని చెప్పారు.